'భరత్ అనే నేను' సినిమా అదనపు ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

  • ఎల్లుండి విడుదల కానున్న మహేశ్‌ కొత్త సినిమా
  • ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలు
  • ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు
కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భరత్ అనే నేను’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అదనపు ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఏపీ సర్కారు పేర్కొంది.

కాగా, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మించగా, ఇందులో కైరా అద్వానీ.. మహేశ్‌ బాబుకి జోడీగా నటించింది. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సీఎంగా నటిస్తోన్న మహేశ్‌ బాబు 'భరత్‌ అనే నేను' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
Go Back to Shorts
Bharath Ane Nenu
Mahesh Babu
Andhra Pradesh

More Telugu News